Wednesday October 01, 2008
గ్రంధ చౌర్యం పదిరోజుల క్రితం డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ పదవ వార్షికోత్సవ సంబరాల (
1,
2,
3,
4)
సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన చంద్రలత e-చౌర్యం గురించి అనుమానాలు వెలిబుచ్చారు. ఇంటర్నెట్లో (అందునా యూనీకోడ్లో) వ్రాయడం మూలాన ఈ చౌర్యం ఎక్కువ/తేలిక అవుతోందని లేదా అందుకు దోహద పడుతున్నాయని ఆవిడ అభిప్రాయం.
నా ఉద్దేశంలో e-చౌర్యానికి భయపడి ఇంటర్నెట్/యూనీకోడ్ వాడకం తగ్గించడం కూడదు. అసలు చెప్పాలంటే ఎలాక్ట్రానిక్ రూపంలో ఉంటే e-చౌర్యాన్ని తేలికగా పట్టుకోవచ్చు. ఈవాళే బీబీసీలో వచ్చిన ఈ కథనం చూడండి. బ్రిటీషుఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఉపన్యాసాన్ని కెనడా ప్రధానమంత్రి యధాతథంగా చౌర్యం అని వార్త. ఈ ఉపన్యాసాలు ఎలక్ట్రానిక్ రూపంలో లేకపోతే ఎప్పటికి తెలిసేది కాదేమో.
ఈ e-చౌర్యం ఎలక్ట్రానిక్ రూపం నుంచి మన వార్తాపత్రికలు యధాతథంగా ఎత్తేసి వేరే పేర్లతో ప్రచురించుకొని డబ్బుచేసుకోవడం మరో ఎత్తు. ఈ తరహా చౌర్యం తనను అమితంగా కలవరపెడుతున్నదని చంద్రలత అన్నారు. నిజానికి ఇది కేవలం తెలుగు వాళ్లకే కాక మిగతా భారతీయ జనాభాకి కూడా వర్తిస్తుంది. ఇవి చూడండి:
తెలుగు ప్రొఫెసరు,
టైమ్స్ ఆఫ్ ఇండియా,
1,
2,
3
Posted by Murali
( Oct 01 2008, 08:49:42 AM EDT )
Permalink
Comments [1]
http://telanganautsav.wordpress.com/2007/09/18/vaartha_plagiarism
వార్త పత్రిక(16 September 2007)చేసిన గ్రంధ చౌర్యం వివరాలు పై లింక్ ల చూడొచ్చు.
Posted by JayaPrakash Telangana on October 22, 2008 at 01:14 AM EDT
Website: http://japes.wordpress.com #